![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.... గంగని మను వెతుక్కుంటూ గుడికి వస్తాడు. గంగని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అమ్మవారి మెడలోని తాళి తీసుకొని మను గంగ మెడలో కట్టబోతుంటే రుద్ర వచ్చి మనుని ఆపుతాడు. మనుని కొడతాడు రుద్ర. ఆ తర్వాత రౌడీలని కూడా కొడతాడు రుద్ర. అదంతా దూరం నుండి వీరు చూసి మళ్ళీ ఈ రుద్ర ఎక్కడ నుండి వచ్చాడని డిస్సపాయింట్ అవుతాడు.
రౌడీలని పోలీసులకి పట్టించండి ఒక వీడిని మాత్రం నాకు అప్పగించండి అని మనుని తీసుకొని రుద్ర పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. గంగ కూడా వెళ్తుంది. రుద్ర సర్ లేకుంటే నా పరిస్థితి ఏమై ఉండేదోనని గంగ ఎమోషనల్ అవుతుంది. మనుని రుద్ర, పెద్దసారు కొడతారు. నువ్వు ఇదంతా ఎందుకు చేసావని అడుగుతారు. వీడు నిజం చెప్తాడా ఏంటని ఇషిక టెన్షన్ పడుతుంది. అప్పుడే వీరు పోలీసులని తీసుకొని వచ్చి మనుని అరెస్ట్ చేయమని చెప్తాడు. నువ్వు ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళు నిన్ను తర్వాత బయటకు తీసుకొని వస్తానని మనుకి వీరు సైలెంట్ గా చెప్తాడు. ఆ తర్వాత గంగ మీ అమ్మ కనిపించడం లేదు అని గంగ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి చెప్తారు.
ఈ లెటర్ దొరికింది అని ఇస్తారు. ఆ లెటర్ పెద్దసారు చదువుతాడు. గంగ నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావ్.. నాతో ఉంటే మళ్ళీ మీ నాన్న ఎవరికైనా అమ్మేస్తాడు.. అందుకే నేనే నీకు దూరంగా వెళ్తున్నా నా కోసం చూడకు.. నిన్ను అమ్మగారు చేరదీస్తారు. అనుకుంటున్నా.. జాగ్రత్త అని అందులో రాసి ఉంటుంది. అది విని గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగని పెద్దసారు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎందుకు తీసుకొని వచ్చారని ఇంట్లో వాళ్ళు అడ్డుచెప్తారు. గంగ ఇక్కడే ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఎవరికి వారు విడిగా ఉందామని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |